అయస్కాంతం షాక్ ఎందుకు కొట్టదు?

షాక్ కొట్టాలంటే శక్తి శరీరంగుండా ప్రవహించాలి. ఆ ప్రవాహ తీవ్రతలో మన శరీరపు సహజ జీవ భౌతికచర్యలు (Physiological activities), అపభ్రంశం (imbalance) కావాలి. శక్తి ఎన్నోరూపాల్లో ఉంటుంది. ఉదాహరణకు 'కాంతి' కూడా శక్తి రూపమే. మనం ఎండలో నిల్చుంటే మనకు షాక్ కొట్టడం లేదు కదా? అలాగే ఉష్ణశక్తి కూడా శక్తి రూపమే. కానీ వేడి వస్తువును పట్టుకొంటే అక్కడికక్కడ చర్రుమంటుందిగానీ విద్యుత్షాక్లాగా షాక్ కొట్టదు కదా! అలాగే గాలిలో పవన చలనశక్తి (wind energy) ఉంది. ఈదురుగాలిలో నిల్చుంటే పడిపోతామేమోగానీ విద్యుత్ షాక్లాగా షాక్ కొట్టదు కదా? అసలు విషయం ఏమిటంటే రెండు వేర్వేరు బిందువుల (ఉదాహరణకు చేయి, కాలు లేదా ఎడమ చేయి, కుడిచేయి లేదా ఎడమ కాలు, కుడి కాలు మొదలైనవి) మధ్య శక్తి వ్యత్యాసం (energy gradient) ఉందనుకుందాం.

ఈ ప్రక్రియలలో ఎలక్ట్రాన్లు ఒక క్రమపద్ధతిలో స్థానాలు మారుతూ జీవాన్ని నడిపిస్తుంటాయి. అంటే ఎలక్ట్రాను బదిలీ (electron transfer) చర్యలే జీవమనే నాటకంలో ప్రధానఘట్టాలు, దృశ్యాలు, డైలాగులు. అలాంటి ఎలక్ట్రాను బదిలీ చర్యలలోకి బయటి ఎలక్ట్రాన్లు దూరితే అపభ్రంశం చెంది, క్రమత్వం పోయి మరణం సంభవిస్తుంది. దీన్నే విద్యుత్ షాక్ అంటాము. పిడుగు పడ్డప్పుడు జరిగే చర్య కూడా ఇలాంటిదే.

చనిపోబోతున్న వ్యక్తికి నీరు తాపిస్తే తొందరగా ఎందుకు చనిపోతాడు? - పై పాఠకుడే.
చనిపోబోతున్న వ్యక్తి చనిపోబోయే పరిస్థితికి దప్పికో, వడదెబ్బో, ఆయాసమో, నిర్జలీకరణమో (dehydration) అయితే నీరు తాపిస్తే చనిపోయేబదులు చావు నుంచి బయటపడి బతికే అవకాశముంది. కాబట్టి చనిపోబోతున్న వ్యక్తులకు నీరు తాగిస్తేనే మంచిది. పై కారణాలు ఏమీ కాకుండా మరేదో కారణాల వల్ల చనిపోబోతున్నా నీరు తాపిస్తే తొందరగా మరణిస్తారనుకోవడం కేవలం అశాస్త్రీయం. శ్వాసక్రియలో లయ తప్పడం వల్ల మరణానికి చేరువవుతున్న సందర్భంలో నీరు తాపితే అవి పొరపాటున ఊపిరితిత్తులలోకి వెళితే ప్రమాదం. కానీ అది చాలా అరుదైన విషయం. నీరు తాపడం మంచిది. డాక్టరు సలహా మరీ మంచిది.
భూమి ఎపుడు వినాశనం అవుతుందో లెక్కించగలమా? - ఎం.అజరుకుమార్, వరంగల్.
తనంత తానుగా వినాశనం (destruction) అయ్యే లక్షణం ఏదీ భూమికి లేదు. కానీ సామ్రాజ్యవాదులు, యుద్ధకాంక్షాపరులు తమ వద్ద ఉన్న అణుబాంబుల్ని, హైడ్రోజన్ బాంబుల్ని ప్రపంచదేశాల మీద ప్రయోగిస్తే భూమి చాలామటుకు నువ్వన్న రూపంలో వినాశనం ఏరోజైనా చెందే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ప్రపంచ శాంతి కాముకులు ఎపుడూ కాపాడతారని అనుకొందాం. అలాంటపుడు భూమి వినాశనం ఏమీ కాదు. కానీ భూమికి శాశ్వతత్వం కూడా లేదు. ఒకరోజు అది అంతరిస్తుంది. సూర్యుడు ఓ నక్షత్రం. తనలో ఉన్న హైడ్రోజన్ కేంద్రక సంలీన (nuclear fusion) ఇంధనం అయిపోయే సమయంలో క్రమంగా తన ఘనపరిమాణాన్ని పెంచుకొంటూ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత భూమిని తనలో ఇముడ్చుకొంటూ పెరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ కుంచించుకుపోయి తన తుది రూపమైన శ్వేత కుబ్జ (white dwarf) గా మారుతుందని అంచనా!
No comments:
Post a Comment