21 Feb 2012

దోమ తెరలు వాడండి ఐదు జబ్బులు నిరోధించండి


* దోమ కుట్టడం వల్ల మనం 5 ప్రమాదకర వ్యాధులకు గురవుతాం.
* అవి మలేరియా, డెంగీ జ్వరం, మెదడువాపు, చికున్‌గున్యా, బోధ వ్యాధి.
* మలేరియా, డెంగీ, మెదడువాపు వాపుతో మరణం సంభవించొచ్చు.
* చికున్‌గున్యా దీర్ఘకాలం నొప్పులతో బాధపెడుతుంది. బోధ వ్యాధి దీర్ఘకాలం వైకల్యాన్ని కలిగిస్తుంది.
* దోమ తెరలు వాడటం వల్ల మనం ఈ ఐదు వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.
* 18వ శతాబ్దంలోనే దోమతెరలు వాడారట. ఈజిప్టు మహారాణి క్లియోపాత్ర తెరలోపలే నిదురించేదట.
* సూయజ్‌ కాల్వ నిర్మాణంలో అక్కడ పనిచేసే వారికి మలేరియా ఎక్కువగా వచ్చేదట. వారు దోమ తెరలు వాడి మలేరియాను తగ్గించుకున్నారట.
* సాధారణంగా మనం దోమతెరలు నూలు, నైలాన్‌, పాలిఎస్టర్‌ దారంతో చేస్తాం.
* ఇప్పుడు దోమల జబ్బుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 'క్రిమి సంహారక మిలిత దోమ తెరలు' , 'చిరకాలం మన్నే క్రిమిసంహారిణి దోమతెరలు' అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాలలో ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇవి దోమలను దగ్గరకు రానివ్వవవు. దోమలను చంపెస్తాయి.

No comments: